ADILABAD: ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సన్మానం
చిత్రం న్యూస్, జైనథ్: ఎస్సీ సబ్ప్లాన్ క్రింద ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో సీసీ రోడ్లు నిర్మాణానికి రూ.46 లక్షల నిధులను మంజూరు చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను జైనథ్ గ్రామ బీజేపీ నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సామ రమేష్ రెడ్డి, జైనథ్ మండల ఉపాధ్యక్షుడు ప్రతాప్ యాదవ్, యువ మోర్చా మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు గొడుగుల సత్యనారాయణ, నాయకులు చిల్కూరి లింగారెడ్డి, చిల్క చిన్నన్న, సంతోష్ రెడ్డి, బిక్కి సంతోష్, రామన్న యాదవ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
