మూడు నెలలుగా ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్లకు అందని వేతనాలు
చిత్రం న్యూస్, నిర్మల్ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సర్వీస్ పర్సనల్ (స్కావెంజర్ ) కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల కార్మికుల సంఘం అధ్యక్షులు కదం మారుతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో విద్యా కమిటీ పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభంలో కమిటీ తీర్మానం ప్రకారం పాఠశాల సర్వీస్ పర్సనల్ (స్కావెంజర్ ) కార్మికులను నియమించుకుందని, అప్పటి నుండి నేటికి మూడు నెలలు గడిచిన వేతనాలు అందలేదన్నారు. విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఒకటి నుండి ముప్పై మంది విద్యార్థుల సంఖ్య ఉంటే మూడు వేలు, ముప్పై నుండి అరవై మంది విద్యార్థులు ఉంటే ఆరు వేలు, అరవై పైకి గా ఉంటే పన్నెండు వేలు..ఎన్నో ప్రభుత్వాలు మారిన కానీ సమస్యలు మాత్రం ఇప్పటి వరకు పరిష్కారం కాలేదన్నారు. మూడు నెలలు నుండి జీతాలు లేకుండా పని చేస్తే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని అన్నారు. జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించి జీవో ప్రకారం పెండింగ్ వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఈవో భోజన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పి.సత్తన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండూరు మల్లేష్, పాండురంగ, పోశెట్టి, కవిత, భోజన్న, లక్ష్మి, చంద్రకాంత్, రాణి, నారాయణ, లక్ష్మి, చిన్న సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

