Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

గంగాధర్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత

గంగాధర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 

చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా రూ.5 లక్షల చెక్కును ఎక్సైజ్, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు,  ఖానాపూర్  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారీగా కురిసిన వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నిండడంతో వరద నీరును దిగువ ప్రాంతానికి పంపే క్రమంలో కడెం డ్యామ్ గేట్లను ఎత్తడంతో ఆ వరద ప్రవాహానికి గంగాధర్  వరద నీటికి కొట్టుకుపోయారు. ఆచూకీ దొరకపోవడంతో ప్రభుత్వం నుండి కుటుంబ సభ్యులకు  ఆర్థిక సహాయంగా  రూ.5 లక్షలను అందజేశామని, అలాగే కుటుంబ సభ్యులలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు అందజేసి వారి కుటుంబానికి అండగా నిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

RELATED ARTICLES

Recent Comments