Chitram news
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 5:34 am Editor : Chitram news

ఇందిరమ్మ మోడల్ హౌస్ ను  ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ఇందిరమ్మ మోడల్ హౌస్ ను  ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండల కేంద్రం కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను,  గురుకుల పాఠశాల భవనంలోని డార్మెటరీ నూతన భవనాన్ని జిల్లా ఇంఛార్జ్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్పీ అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ సలోని ఛాబ్రా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి, వివిధ శాఖల అధికారులు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.