ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను, గురుకుల పాఠశాల భవనంలోని డార్మెటరీ నూతన భవనాన్ని జిల్లా ఇంఛార్జ్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్పీ అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ సలోని ఛాబ్రా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి, వివిధ శాఖల అధికారులు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

