ఇందిరా క్రాంతి పథం సీసీ కి సన్మానం
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ గ్రామం ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) సీసీగా విధులు నిర్వహిస్తున్న బండారి విద్యాసాగర్ మండలంలోని వడూర్ గ్రామానికి బదిలీపై వెళ్ళారు. సాయితేజ సంఘము సభ్యులు ఆయనకు మంగళవారం సన్మానం చేశారు. అనంతరం సంఘ సభ్యులు విద్యాసాగర్ నేరడిగొండ మహిళ సంఘాలకు చేసిన సేవలను, పొదుపు పథకంపై అవగాహన కల్పించి సంఘాలని ముందుకు తీసుకెళ్లడంలో చేసిన కృషిని కొనియాడారు. సమావేశంలో లింగరాజు,కవిత, చంద్రకళ, వొస గంగామణి, గంగాధర్, గణేష్ ఉన్నారు.

