విద్యుత్ సరఫరాలో అంతరాయం
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణ పరిధిలో బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని బోథ్ విద్యుత్ ఏఈ శ్రవణ్ కుమార్ మంగళవారం తెలిపారు. 11 కేవీ మరమ్మతుల కారణంగా సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. బోథ్ పట్టణ వినియోగదారులు సహకరించాలని కోరారు.

