Chitram news
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 1:20 pm Editor : Chitram news

ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

చిత్రం న్యూస్, భైంసా:  నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంఘాలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో భైంసా కేంద్రంలోని ప్రభుత్వ గోపాల్ రావు పటేల్ డిగ్రీ కళాశాలలో కాళోజీ చిత్రపటానికి ప్రిన్సిపల్‌ కరోల్ల బుచ్చయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ..ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న కాలోజీ భావజాలంలో ఎంత లోతైన ఆలోచన కలిగి ఉందో గమనించవచ్చన్నారు. పద్మశ్రీ, పద్మ విభూషణ్ వంటి బిరుదుల్ని పొందడమే కాకుండా తమ సమాజ స్థాపనకై ఆయనఎంతో కృషి చేశారనన్నారు.  సమాజంలోని వ్యత్యాసాలను ఎండగడుతూ అనేక కవితల్ని రచించారన్నారు. తెలుగు సహాయాచార్యులు రాజు మాట్లాడుతూ.. బడి పలుకుల భాష కాదు పలుకు బడుల భాష కావాలని ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం “అదే జీవితం” అంటారు.  కాళోజీ అని వారన్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1,2 ప్రోగ్రాం ఆఫీసర్స్ ఆరే రాజు ఓం ప్రకాష్ లా ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ర వికుమార్, డా.పవన్ కుమార్, డా భీమ్ రావు, డా పీజీ రెడ్డి, డా.శంకర్, గుంత సుధాకర్, డా.సంతోష్ కుమార్, డా.నహెదా, డా.కల్పన, దివ్య రామ్మోహన్, సురేందర్, మజర్ అబ్దుల్లా, కిషన్, శ్రావణ్య, అర్షియ,  ఉజ్మ సమరిన్, వాహిద్, ఇర్ఫాన్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు.