ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో డబ్బులు ఖాతాలో పడక ఇబ్బందులు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం సందర్భంగా డబ్బులు ఖాతాలో జమ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందిరమ్మ పథకం ద్వారా జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన జి.వెంకటమ్మ అనే మహిళ నిర్మించుకుంటున్న ఇంటి బేస్ మెంట్ లెవల్, ఫొటో క్యాప్చర్ పూర్తయినప్పటికీ వారి ఖాతాల్లో ఇంకా నిధులు జమ కాలేదు. చాల రోజుల నుంచి ఎదురుచూసిన ఇంత వరకు ఖాతాలో నిధులు రాకపోవడంతో “ప్రజావాణి” (ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం) లో కలెక్టర్ రాజర్షి షా కు బీజేపి నాయకుడు సూర్య ప్రకాష్ రెడ్డి జి.వెంకటమ్మతో కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించాలని బాధిత మహిళ వేడుకున్నారు.



