Chitram news
Newspaper Banner
Date of Publish : 06 September 2025, 3:05 pm Editor : Chitram news

వేలం పాటలో  లడ్డూ దక్కించుకున్న విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బడాల విలాస్ రెడ్డి

వేలం పాటలో  లడ్డూ దక్కించుకున్న విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బడాల విలాస్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో  విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బడాల విలాస్ రెడ్డి రూ.22,500 కు లడ్డూ దక్కించుకున్నారు. మండలి నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. మండలిలో ఏర్పాటు చేసిన  గణేష్ విగ్రహ  దాత కొంచెం వార్ సుభాష్ ను ఈ సందర్భంగా సన్మానించారు.  వినాయకుడికి వేద మంత్రాలతో ఉత్తర పూజను పూజారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, కైలాష్ నగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు లోక ప్రవీణ్ రెడ్డి, రాపల్లి పవన్ కుమార్, శ్రీపద్ మాసాడే,  దెబ్బడి ఉల్లాస్, బడాల విలాస్ రెడ్డి, ప్రవీణ్ అగర్వాల్, జవాజి కృష్ణ, సదేశ్, కొంచెం వార్ సుభాష్, శోభలతా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.