ఆదిలాబాద్ లో ఘనంగా ఓనమ్ పండగ
చిత్రం న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ మండలంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ఓనమ్ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా వారు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన హిందూ ధర్మం గొప్పదనం గురించి ప్రపంచ దేశాలు అధ్యయనం చేస్తున్నాయని అన్నారు. భారత దేశంలోనే గుళ్ళు గోపరాలు నిర్మించి, యాగాలు జరిగేవని, ప్రస్తుతం సౌదీ అరేబియా లాంటి వివిధ దేశాలలో సైతం పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించి యాగాలు చేపట్టడం మన హిందూ ధర్మం చాటి చెప్పిన గొప్ప శాంతి మంత్రం అన్నారు. ఇతర దేశాలు సైతం మన అడుగు జాడల్లో నడుస్తున్నారంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పయో అర్థం చేసుకోవచ్చన్నారు. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవడం మన దేశ గొప్పదనం అని పేర్కొన్నారు.




