బై బై….గణేశా
భైంసాలో కొనసాగుతున్న వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు *వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్ *బందోబస్తును పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర కొనసాగుతుంది. తొమ్మిది రోజులపాటు వివిధ గణేష్ మండలీల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విగ్నేశ్వరుడికి ఉదయం, సాయంత్రం సమయాల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించారు. అడుగడుగునా మంగళ హారతులతో మహిళలు...