Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

మత సామరస్యాన్ని చాటిన మైనార్టీ నాయకులు

మత సామరస్యాన్ని చాటిన మైనార్టీ నాయకులు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని సర్కార్ గణేష్ మండలి వద్ద మైనార్టీకి చెందిన షేక్ అబుద్ ఆత్మ డైరెక్టర్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. బోథ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ లతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బోథ్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని గణేష్ ఉత్సవాలు కానీ బక్రీద్, మొహర్రం, ఇలా ఏ పండగ అయినా అన్ని మతాల ప్రజలు కలిసి చేసుకుంటామని అన్నారు. గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆ గణేశుని ఆశీర్వాదం తో బోథ్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments