పెద్దాపురం: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్ రావు
చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్ రావు స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం పంపిణీ చేశారు. ప్రభుత్వం నిత్యవసర సరుకుల పంపిణీ వ్యవస్థకు సంబంధించి పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొచ్చింది .పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు రేలంగి బుజ్జి, వెన్న వెంకటేష్ , కంటి బోయిన చంటిబాబు, కంటి బోయిన ప్రసాద్, బొంగు వీరయ్య, నూకల మంతి నాగేశ్వరరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

