Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

వినాయక మండపాల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి పూజలు

వినాయక మండపాల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి పూజలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ కల్చరల్:  గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ, కేఆర్కే కాలనీ, న్యూ హోసింగ్ బోర్డ్ కాలనీ, దోబీ కాలనీ, రాంనగర్, బట్టిసావర్గాం  గ్రామాల్లో ప్రతిష్టించిన పలు గణేష్ మండపాలను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకుడికి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో, పలు మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మండప నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డిని శాలువాతో సన్మానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..సర్వ విఘ్నాలను హరించే ఆ లంబోదరుడి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండి, సుఖ సంతోషాలతో, పంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వినాయక నిమజ్జనాలు చేసేవేళ ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఊరేగింపు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments