డెంగ్యూతో ఒకరు మృతి
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన చౌలమద్ది రాజేష్ (20) డెంగ్యూతో మృతిచెందారు. గత వారం రోజుల క్రితం నుంచి జ్వరం రాగా స్థానిక హాస్పిటల్లో చూపించారు. జ్వరము తీవ్రత ఎక్కువగా ఉందని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పడంతో చికిత్స నిమిత్తం బుధవారం సాయంత్రం జ్వరం ఎక్కువ కావడంతో నిర్మల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం 6 గంటల సమయంలో హాస్పిటల్లో రాజేష్ మృతిచెందారు. ప్లేట్ లెట్స్ కౌంట్ చాలా తగ్గిపోయిందని, డబ్ల్యూబీసీ కౌంట్ కూడ తగ్గడంతో మృతిచెందాడని డాక్టర్లు తెలిపారని, మృతుని తండ్రి చౌలమద్ది నడిపి రాజలింగు తెలిపారు. రాజేష్ మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

