సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ కాంగ్రెస్ నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రిజర్వేషన్ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న ఈ చర్య పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేరడిగొండ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నాయుడి రవి, ఆత్మ డైరెక్టర్ కుంట శంకర్, పాల శంకర్, దరందాస్ మహేందర్, కొప్పుల ఉషన్న, గంగారెడ్డి, బోలశెట్టి రాములు, సాంగు భోజన్న, పాల వెంకటరమణ, గుడ్ల పెద్ద బాపు, కొప్పుల భోజన్న, ప్రవీణ్, వడూర్ బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.