BSNL సీజీఎంను కలిసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మారుమూల గిరిజన ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని వినతి
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలపై హైదరాబాద్ లో గల BSNL సీజీఎంను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో గల మారుమూల గిరిజన ప్రాంతాల్లో నెట్వర్క్ లేక అవస్థలు పడుతున్నారని, నెట్వర్కులు లేని ప్రాంతాల్లో నూతన టవర్లు ఏర్పాటు చేయాలని ఆయన్ను కోరారు. నెట్వర్కులు ఉన్న గిరిజన ప్రాంతాల్లో టవర్లు సాంకేతిక లోపాల వల్ల నెట్వర్క్ సమస్యలు ఏర్పడుతున్నాయని, కొన్ని టవర్లకు విద్యుత్తు సౌకర్యం లేకపోవడంపై ఇబ్బంది తలెత్తుతుంది అని వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన సీజీఎం కచ్చితంగా నెట్వర్క్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.