గణనాథుడి సేవలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ప్రతిష్టించిన గణనాథుడిని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్ రెడ్డి మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం మండప నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట మావల మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, గణేష్ మండప నిర్వాహకులు సుధాకర్, అభిలాష్ తదితరులు ఉన్నారు.




