Chitram news
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 9:44 am Editor : Chitram news

ఆడే గజేందర్ ని కలిసిన బోథ్ మాల సంఘ సభ్యులు

ఆడే గజేందర్ ని కలిసిన బోథ్ మాల సంఘ సభ్యులు

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ ని బోథ్ మాల సంఘ సభ్యులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శ్మశానవాటిక వద్ద రెండు రోజుల్లో బోరు వేయిస్తానని, కమ్యూనిటీ హాల్ కు రూ.5 లక్షలు, శ్మశానవాటికకు సీసీ రోడ్డు త్వరలో మంజూరు చేస్తాననన్నారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఆడే గజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల సంఘ పట్టణ అధ్యక్షుడు బత్తుల ఉషన్న, మాజీ అధ్యక్షులు బక్కువారి రామయ్య, అర్ష భూమన్న, ఏరోల్లా రమేష్, బక్కువారి నారాయణ, అర్ష రవి, కరుణాకర్, బోథ్ మాజీ ఎంపీటీసీ కుర్మే మహేందర్, సీనియర్ నాయకులు బొజ్జా సాయన్న తదితరులు పాల్గొన్నారు.