Chitram news
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 1:16 pm Editor : Chitram news

ముథోల్‌లో ఘనంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

ముథోల్‌లో ఘనంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

*పూజ చేసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ జానకీ షర్మిల

చిత్రం న్యూస్, ముథోల్‌: నిర్మల్ జిల్లా ముథోల్ పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక ప్రదర్శనలు, డీజే  చప్పుళ్ళు, భక్తిగీతాలు ఉత్సవ వాతావరణాన్ని అలరించాయి. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు సమయానికి నిమజ్జనం పూర్తి చేసి, పోలీసులు సూచించిన మార్గదర్శకాలకు సహకరించాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో సీఐ మల్లేష్, ఎస్సై పెర్సిస్ బిట్ల, గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.