డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుడి కోసం దరఖాస్తులు ఆహ్వానం
చిత్రం న్యూస్, భైంసా :నిర్మల్ జిల్లా భైంసా లోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గంటల ప్రాతిపదికన అతిథి అధ్యాపకుడి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆంగ్లం,కామర్స్ బోధించుటకు ఈనెల 5లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పీజీలో 55 శాతం మార్కులు ఉండాలని, పీహెచ్ డీతో పాటు బోధనలో అను భవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు.