చిత్రం న్యూస్, నేరడిగొండ:
పత్తి చేనులో గంజాయి సాగు
*రూ.4 లక్షల విలువైన మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం గోవిందుపూర్ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం మేరకు దాడులు నిర్వహించగా రూ.4 లక్షల విలువైన 80 మొక్కలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.ఎస్సై తెలిపిన ప్రకారం..నేరడిగొండ మండలం గోవిందు పూర్ గ్రామానికి చెందిన రాజు జాదవ్, విజేష్ రాథోడ్ చేనులో గంజాయి సాగు చేస్తున్నారు. రాజు జాదవ్ పత్తి పంట మధ్యలో 57 గంజాయి మొక్కలు, విజేష్ రాథోడ్ చేనులో 23 గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.