ఆకట్టుకుంటున్న రెడ్డి బాలల గణేష్ మండలి గణేషుడు
సామూహికంగా మహిళల కుంకుమార్చన, ప్రత్యేక పూజలు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని రెడ్డి బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేషుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలతో పాటు నిత్యాన్నదానం కొనసాగిస్తున్నారు. ఆదివారం మహిళలంతా కలిసి సామూహికంగా కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. మహిళలంతా ఓకే చోట చేరి ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

