Chitram news
Newspaper Banner
Date of Publish : 31 August 2025, 12:57 pm Editor : Chitram news

తరోడలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం 

తరోడలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం 

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని తరోడ గ్రామంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఐదు రోజుల పాటు గ్రామమంతా భక్తిశ్రద్ధలతో వినాయకుని పూజలు నిర్వహించి, ఆ తర్వాత నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. డీజే చప్పుడు నడుమ, డోలు వాయిద్యాలు, బాణాసంచా కాంతులు, పూల వర్షం మధ్య గణపతి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. “గణపతి బప్పా మోరియా” నినాదాలతో తరోడ గ్రామం మార్మోగింది.

పెద్దలు, యువత, మహిళలు, పిల్లలు అందరూ కలిసి ఒకే తాటిపై నడిచి పాల్గొనడం పండుగకు మరింత అందాన్ని తెచ్చింది. ఊరంతా ఒకే వేదికపై ఏకమై పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తరోడ గ్రామంలో గణేష్ నిమజ్జనం జాతర వాతావరణాన్ని తలపించగా, అందరి ముఖాల్లో ఆనందం, భక్తి, ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు. ఎస్సై బిట్ల పెర్సిస్ ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.