Chitram news
Newspaper Banner
Date of Publish : 31 August 2025, 2:39 am Editor : Chitram news

ఆకట్టుకుంటున్న శివశక్తి గణేషుడు

ఆకట్టుకుంటున్న శివశక్తి గణేషుడు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కుమార్ పేట్  లోని శివశక్తి మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేషుని భారీ ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్ రోడ్డు పక్కన ఉన్న హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహం కొలువుదీరింది. నిత్యం భక్తుల పూజలతో  ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకొంది. సాంప్రదాయ భజనలు, భక్తి గీతాలు, గణేశునికి జై అంటున్నాయి.  శివశక్తి గణేష్ మండల్ కుమార్ పేట్ అధ్యక్షులు కందుల రవీందర్,  ప్రధాన కార్యదర్శులు సోమ తిరుపతి, ,అందే సతీష్ , జెట్టి సృజన్, నిర్వాహకులు కుర్మా దత్తు ,అందే కార్తీక్, మణికంఠ, శివ తదితరులు నిత్యం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.