ఆకట్టుకుంటున్న శివశక్తి గణేషుడు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కుమార్ పేట్ లోని శివశక్తి మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేషుని భారీ ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్ రోడ్డు పక్కన ఉన్న హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహం కొలువుదీరింది. నిత్యం భక్తుల పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకొంది. సాంప్రదాయ భజనలు, భక్తి గీతాలు, గణేశునికి జై అంటున్నాయి. శివశక్తి గణేష్ మండల్ కుమార్ పేట్ అధ్యక్షులు కందుల రవీందర్, ప్రధాన కార్యదర్శులు సోమ తిరుపతి, ,అందే సతీష్ , జెట్టి సృజన్, నిర్వాహకులు కుర్మా దత్తు ,అందే కార్తీక్, మణికంఠ, శివ తదితరులు నిత్యం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.