Chitram news
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 4:06 pm Editor : Chitram news

రైతులు యూరియా కోసం పెనుగులాట

రైతు సేవా కేంద్రం వద్ద తోపులాట

ముగ్గురు రైతులకు స్వల్ప గాయాలు

చిత్రం న్యూస్,పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఉలిమేశ్వరంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా కోసం పెనుగులాట, రైతు సేవా కేంద్రం వద్ద రైతుల మధ్య తోపులాట శనివారము ఉలిమేశ్వరంలో జరిగింది. ఈ ఘటన స్థలంలో ముగ్గురు రైతులకు స్వల్ప గాయాలయ్యాయి .పెద్దాపురం మండలం ఆర్ బీ పట్నం సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ అధికారులు, అధికారులు స్పందించి యూరియా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.