కాంగ్రెస్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డిని సన్మానిస్తున్న బ్లూ భీం యూత్ సభ్యులు
చిత్రం న్యూస్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం బ్లూ బీం యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండల్ వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా లోక ప్రవీణ్ రెడ్డిని యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు. రోహిత్ షిండే, భూపేందర్, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమేందర్ లోక, సంజీవ్, అఖిలేష్, అశోక్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
