బోథ్ సివిల్ కోర్టు జడ్జిగా న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్
చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్ కు న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బోథ్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, బోథ్ జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ పంద్రం శంకర్ శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వామన్ రావ్ దేశ్ పాండే, పీ పీ శ్రీధర్, ఏజీపీ పంద్రం శంకర్, ఉపాధ్యక్షులు దమ్మపాల్ అంగద్, ఆడెపు హరీష్, రూపేందర్ సింగ్, కుమ్మరి విజయ్ కుమార్, రాజు పాల్గొన్నారు