Chitram news
Newspaper Banner
Date of Publish : 27 August 2025, 2:28 pm Editor : Chitram news

BORANCHU SEEEKANTH REDDY-బోరంచు నివాసంలో గణనాథునికి పూజలు

BORANCHU SEEEKANTH REDDY-బోరంచు నివాసంలో గణనాథునికి పూజలు

చిత్రం న్యూస్, మావల: ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో కొలువు దీరిన వినాయకునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు రచన- శ్రీకాంత్ రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమంలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వినాయకుడికి ప్రీతి పాత్రమైన 21 రకాల కూరగాయలతో తయారు చేసిన వంటకాలతో, ఉండ్రాల పాయసంతో నైవేద్యాన్ని సమర్పించారు.భక్తి శ్రద్ధలతో లంభోదరుడున్ని కొలిచారు. అనంతరం మావలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాoతులతో ఉండాలన్నారు. రైతులకు తమ పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు నిర్వహించే వినాయకుని పూజలు మొదలుకొని నిమజ్జనం వరకు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులు నిఖిత-ప్రశాంత్ రెడ్డి, సాయి చందన రెడ్డిలు పాల్గొన్నారు.