Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ధి

పనులు జాతర కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్న జిల్లా పంచాయితీ అధికారి రమేష్ 

చిత్రం న్యూస్, జైనథ్: గ్రామాలు అభివృద్ది చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జిల్లా పంచాయతీ అధికారి రమేష్ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వార రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు జాతర – 2025 భాగంగా జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు జిల్లా పంచాయతీ అధికారి రమేష్ భూమిపూజ చేసి ప్రారంభించారు. అంతకు ముందు గత సంవత్సరం ఉపాధి హామీ పథకం ద్వారా ద్ నిర్మించిన నడాఫ్ కమ్ షెడ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం చేపట్టిన పనులు జాతర కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చాలా అభివృద్ది పనులు జరగుతున్నయన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రైతులు, ఉపాధి హామీ కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భగా 100 రోజులు ఉపాధి హామి పని దినాలు పూర్తి చేసిన కూలీలను, గ్రామ పంచాయతి కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల ఎంపీడీవో మహేష్ కుమార్, ఏపీవో సుభాషిణి, పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, గ్రామస్తులు పెంచల ఉశన్న,సోమ రాంరెడ్డి, ఎండ్ర వాకేశ్,సింగిరెడ్డి రాంరెడ్డి, రాజన్న, ప్రవీణ్ రెడ్డి, పూర్ణచందర్ రెడ్డి, రాకేష్, చిన్నరెడ్డి రాములు, ఆశన్న పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments