వాటర్ ఫాల్ లో పడి వైమానిక జవాన్ మృతి
*తరోడ గ్రామంలో విషాద ఛాయలు
*కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్
చిత్రం న్యూస్, ముథోల్ : నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన లక్ష్మీ ఈశ్వర్ ప్రసాద్ అనే వైమానిక జవాన్ ఆగ్రాలోని దమ్మోహ వాటర్ ఫాల్ కు బుధవారం స్థానిక సహోద్యోగులతో వెళ్లారు. అక్కడే ప్రమాదవశాత్తుపడి మృతి గల్లంతయ్యాడు. స్థానిక పోలీసులు జాలర్లతో వాటర్ ఫాల్ లో గాలించగా మృతదేహం గురువారం బయటపడింది. ఈ విషయం తెలియడంతో తన స్వగ్రామం తరోడ గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. దేశం కోసం వైమానిక దళంలో పనిచేసి ఇలా ప్రమాదవశాత్తు చనిపోవడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాన్ని రప్పించడానికి గ్రామస్తులు, తరోడ మాజీ సర్పంచ్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ను కలవడంతో ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ తో మాట్లాడారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. కేంద్రమంత్రి స్పందించి సత్వర ఏర్పాటు చర్యలు ప్రారంభించారు.