Chitram news
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 1:17 pm Editor : Chitram news

సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ  చేసిన  డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్

సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ  చేసిన  డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్

చిత్రం న్యూస్, సొనాల : ఆదిలాబాద్ జిల్లా సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి డా.శ్రీధర్ తో కలిసి  డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, సమయపాలన పాటించాలని సూచించారు. ఆసుపత్రిలో ఓపి విభాగంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్న గుట్ట పక్క తండా, గుర్రాల తండా గ్రామాలలో శానిటేషన్ పరిశీలించి ఫీల్డ్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని ఆర్ఎంపీ కేంద్రాలను పరిశీలించారు. ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని, అర్హతకు మించి వైద్యం చేయరాదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డి, సూపర్వైజర్ కవిత, హెల్త్ అసిస్టెంట్ లింగారెడ్డి, ఏఎన్ఎం అనసూయ, ఆశా కార్యకర్తలు ఉన్నారు.