ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
చిత్రం న్యూస్ బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని అంజన స్టూడియో ఆవరణలో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ ప్రపంచ ఛాయాచిత్ర పితామహుడు జుకులాస్ లూయిస్ డాగురే మండే 171 వ వర్ధంతి సందర్భంగా బోథ్, సొనాల మండలాల అధ్యక్షులు బుస లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఫొటో వీడియో గ్రాఫర్స్ పాల్గొని లూయిస్ డాగురే కు ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం ఫొటోగ్రాఫర్స్ కేక్ కట్ చేశారు. ఫొటోగ్రపీ అధ్యక్షులు బుస లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఫొటోగ్రఫీ అంటే సృష్టికి ప్రతిసృష్టిగ అద్దం పట్టేది ఒక్క ఫొటోకు మాత్రమేనన్నారు. ప్రతి సన్నివేశం ప్రతి మధుర క్షణాలను పపదే గుర్తు చేసి అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేసేది ఫొటో మాత్రమేనన్నారు. మండల సభ్యులు రంజిత్, ముక్కల రాజేశ్వర్, కాడేరుగుల గణేష్, నరేష్ కుమార్, రవీందర్, లక్ష్మణ్, దేవేందర్, కుశాల్ రెడ్డి,నితీష్ గౌడ్, కాడేరుగుల రాజశేఖర్, సురేష్, ప్రకాష్, జీకే కిరణ్. తదితరులు పాల్గొన్నారు.