Chitram news
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 2:19 pm Editor : Chitram news

పొంగిపొర్లిన వాగులు..నిలిచిపోయిన రాకపోకలు

పొంగిపొర్లినవాగులు..నిలిచిపోయిన రాకపోకలు

*తెలంగాణ _మహారాష్ట్ర  ప్రజల కష్టాలు

చిత్రం న్యూస్, జైనథ్:  ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అదిలాబాద్ నుండి జైనాథ్, బేల మండలాలకు వెళ్లే రహదారులు జలదిగ్బంధం అయ్యాయి. భోరజ్ మండలం తరోడ, జైనథ్ మండలం నిరాల గ్రామం దగ్గరలో ఉన్న లో-లెవల్ వంతెనపై నుండి వరద నీరు రావడంతో. రెండు వైపులా రహదారులు మూసుకుపోయాయి.  దాదాపుగా ఐదు గంటల పైగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో తెలంగాణ _మహారాష్ట్ర  ప్రజలు ఇబ్బందులు పడ్డారు.