పొంగిపొర్లినవాగులు..నిలిచిపోయిన రాకపోకలు
*తెలంగాణ _మహారాష్ట్ర ప్రజల కష్టాలు
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అదిలాబాద్ నుండి జైనాథ్, బేల మండలాలకు వెళ్లే రహదారులు జలదిగ్బంధం అయ్యాయి. భోరజ్ మండలం తరోడ, జైనథ్ మండలం నిరాల గ్రామం దగ్గరలో ఉన్న లో-లెవల్ వంతెనపై నుండి వరద నీరు రావడంతో. రెండు వైపులా రహదారులు మూసుకుపోయాయి. దాదాపుగా ఐదు గంటల పైగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో తెలంగాణ _మహారాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారు.