కాంతయ్య ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం పూలు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాంపల్లి కాంతయ్య ఇంట్లో పెంచుకొంటున్న బ్రహ్మ కమలం పువ్వులు ఆదివారం రాత్రి వికసించాయి. దీంతో ఉపాధ్యాయుడు కాంతయ్య దంపతులు బ్రహ్మ కమలం మొక్కకు పూజలు నిర్వహించారు. ఆ పుష్పాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడి సతీమణి లక్ష్మి మాట్లాడుతూ.. తమ ఇంటిలో బ్రహ్మకమలం పూయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సరిగ్గా మూడేళ్ల కిందట తమ ఇంటి పెరట్లో ఈ మొక్క నాటామన్నారు. తాజాగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో బ్రహ్మకమలం విరబూసిందని ఆమె చెప్పారు. ఆ పుష్పాలను స్థానిక ఆలయానికి అందజేశామని చెప్పారు. అరుదైన, ప్రత్యేకత కలిగిన పుష్పం తమ వీధిలో వికసించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.