బెల్లూరి గ్రామంలో పర్యటించిన మండల అధికారులు
బెల్లూరి గ్రామంలో పర్యటించిన మండల అధికారులు *గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలో వరదనీరుతో గ్రామం అతలాకుతలం గా మారింది. ఆదివారం రోజున హెల్త్ క్యాంప్ ను తహసీల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యురాలు నైనత నిర్వహించారు. ఎంపీడీవో మహేష్ కుమార్, తహసీల్దార్ నారాయణ గ్రామంలో పర్యటించి వరద నీటిలో మునిగిన ఇండ్ల బాధితుల వివరాలు తెలుసుకున్నారు....