Chitram news
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 6:43 am Editor : Chitram news

నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

 

నిరుపేదలకు నిత్యవసర సరకులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 18 రణదివేనగర్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.  జాతీయ గీతాలాపన అనంతరం జెండా వందనం చేశారు. అనంతరం ఇంతియాజ్ ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీకి చెందిన నిరుపేదలకు నిత్యవసర సరకులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి  చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డేరా కృష్ణ రెడ్డి,ఇంతియాజ్ ఖాన్, యశ్వంత్ నిరాడే, శ్యామ్ రావు కామ్డె, షేక్ వాజీద్, దేవానంద్, వాగ్మారే చందు, వినోద్ గైక్వాడ్, రాజశేఖర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.