సామాజిక సేవకుడు డాక్టర్ సాప పండరికి దక్కిన అరుదైన గౌరవం
*తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాప పండరికి డా.బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు
చిత్రం న్యూస్, భైంసా : నిర్మల్ జిల్లా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 14న జరుపుకునే స్వాతంత్ర సంబరాలలో భాగంగా మత్తుకు యువత చిత్తు, బాల్యవివాహాలు అరికట్టడం, వరకట్న వేధింపులు, అన్యాయం అక్రమం జరుగుతున్న చోట ప్రశ్నించి, పేదలకు తగు విధమైన సహాయం అందించడం వంటి పలు సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డును అందజేస్తారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ అడ్వకేట్, ల్యాండ్ ఎక్స్పర్ట్, తెలంగాణ అగ్రికల్చరల్ మరియు ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు ఎం.సునీల్, అసిస్టెంట్ కమిషనర్ మత్తయ్య, హైకోర్టు ప్రముఖ న్యాయవాదులు కడారి రమేష్, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ హిప్నో పద్మకమలాకర్, దళిత రత్న రాజు, ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్, ప్రతినిధులు తిరుమలరావు, నవీన్, దత్త గౌడ్ చేతులమీదుగా డాక్టర్ సాప పండరికి డా. బీఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు”అందించి శాలువాతో సన్మానించారు. అంతే కాక సాప పండరి తండ్రి సాప భూమన్నను శాలువాతో సన్మానించారు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ హిప్నో పద్మ కమలాకర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాప పండరి సామాజిక సేవా కార్యక్రమాలు అమోఘమైనవని, అద్భుతమైనవని, అహర్నిశలు విద్యార్థుల కోసం, యువత కోసం, నిరుపేదల కోసం వారు చేసే సేవలు మాటలలో వర్ణించలేమని, వారికి మేము తోడుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయకుమార్ ఎవరైనా గాని మా ప్రతినిధులకు తప్పుగా మాట్లాడిన, తప్పుడు పనులు చేసిన వారికి చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.
