విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి
*మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో, పలు గ్రామాలతో పాటు విద్యార్థులు చదువుతోపాటు మంచి క్రమశిక్షణతో మెలగాలని మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ విద్యార్థులకు సూచించారు. ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ బేల మాజీ జెట్పిటిసి అక్షిత సతీష్ పవార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమo చెయ్యడం చాలా సంతోషకరం.సతీష్ పవార్ బేల మండలంలోని అనేక పాఠశాల విద్యార్థులకు సేవలు అందించడం చాలా అభినందనీయం అన్నారు,గురువారం మండలంలోని సోన్ కాస్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 80 మంది విద్యార్థులకు మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి విద్యార్థులకు టై, బెల్టు, ఐ కార్డ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, మాజీ ఎంపీపీ గంభీర్ ఠాక్రే ,గ్రామ మాజీ సర్పంచ్ మెస్రం జనార్ధన్,ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, మాజీ సర్పంచ్లు మస్కే తేజ్రావు, విపిన్ ఖోడే, మాజీ ఎంపీటీసీ మంగేశ్ ఠాక్రే,మార్కెట్ మాజీ చైర్మన్ జి సునీల్, ఆకాశ్ గుండార్,గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.*
-Advertisement-
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి
RELATED ARTICLES

