Chitram news
Newspaper Banner
Date of Publish : 13 August 2025, 2:50 pm Editor : Chitram news

ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా సబ్ డివిజన్ లోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ తో  కలిసి గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 11 మంది ఆర్జిదారుల ఫిర్యాదులను ప్రజలు నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వచ్చిన కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాలను తిరిగి కలుసుకునే విధంగా చేశారు.ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు అప్పుగించి సకాలంలో పరిష్కారించాలని ఆదేశించారు.