Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ 

 బైక్ ర్యాలీలో పాల్గొన్న సూర్యాపేట బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి

చిత్రం న్యూస్, మునగాల:  కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు మైలార్ శెట్టి నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలతరెడ్డి మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయడం ప్రతి ఒక్కరికి గర్వకారణం అన్నారు. ఈ పతాకం మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీక. యువత, పిల్లలు, మహిళలు అందరూ దేశభక్తి భావంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మునగాల మండలంలో ప్రతి గ్రామం, ప్రతి వీధి, దేశభక్తి వాతావరణంతో మార్మోగాలని, అందరూ వారి వారి ఇండ్లపై జెండాలు ఎగురవేయడం ద్వారా మన జాతీయ ఐక్యతను మరింత బలపరచాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు భద్రం రాజు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పల్స రమేష్, బీజేపీ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, వెంకటేశ్ బాబు, కపిల్ రెడ్డి, రానబోతు శ్రీనివాసరెడ్డి, రెడ్డిపల్లి శృతి, దొంగరి జ్యోతి, తాళ్ల నరేందర్ రెడ్డి, వినోద్, మధు, గుండు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments