దహిగావ్ లోలేవెల్ వంతెనను పరిశీలిస్తున్న బేల తహసీల్దార్ రఘునాథ్ రావు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దహిగావ్ గ్రామాన్ని బేల తహసీల్దార్ రఘునాథ్ రావు, ఎస్ఐ మహేందర్, పోలీసు సిబ్బంది బుధవారం సందర్శించారు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సలహాలు సూచనలు చేశారు. దహిగావ్ గ్రామంలోని లోలెవల్ వంతెనపై వరద నీరు పొంగిపొర్లడంతో ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగకుండా రోడ్డును దిగ్బంధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి రెవెన్యూ,పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించారు. ఆర్ఐ సాజిద్ తదితరులు ఉన్నారు. ప్రజలేమైన ఇబ్బందులు ఏర్పడితే తమకు సమాచారం అందజేయాలని, సహాయక చర్యలు చేపడతామని సూచించారు.