Chitram news
Newspaper Banner
Date of Publish : 12 August 2025, 4:59 pm Editor : Chitram news

ఆలయ హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తి రిమాండ్‌     

ఆలయ హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తి రిమాండ్‌

చిత్రం న్యూస్, భైంసా:నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోటి దేవుని ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు భైంసా పోలీసులు తెలిపారు. సీఐ గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం..కుంబి గ్రామానికి చెందిన నర్వడే దిగంబర్ (45) ఆగస్టు 11న భైంసా పట్టణం లోని కోతి దేవుడి ఆలయంలో చొరబడి అక్కడ ఉన్న హుండీ చోరీ చేశాడు. దీంతో పోలీసులు విచారణలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి గుర్తించారు. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.