మాకోడ గ్రామంలో బోర్ వేసేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి
చిత్రం న్యూస్, జైనథ్: గ్రామాల అభివృద్ధే లక్ష్యమని బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాకోడ గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.లక్షతో బోర్ వేశారు. గిరిజన ప్రాంతాలకు త్రాగునీరు అందించాలనే ఆలోచనతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహకారంతో బోర్ వేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జైనథ్ మండల ఉపాధ్యక్షులు కుంట వెంకట్ రెడ్డి, మాకోడ బూత్ కమిటీ అధ్యక్షులు అడ్డి శ్రీకాంత్ రెడ్డి, గ్రామ పెద్దలు ఉషరెడ్డి,గంగరెడ్డి లింగన్న, భగవాన్ రెడ్డి, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

