బేలలో జాతీయ జెండాలతో యూత్ సభ్యులు
చిత్రం న్యూస్, బేల: హర్ ఘర్ తిరంగా ప్రతి పౌరుడిలో లోతైనా దేశభక్తిని రగిలిస్తోందని భాజపా ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రాము బర్కడే అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని పాతబస్తీ, ఇంద్రనగర్, పలు కాలనీ వాసులతో కలిసి జాతీయ జెండాలను మంగళవారం పంపిణి చేశారు. ఆగష్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఖోడే సాయి, నివల్కర్ యోగేష్, నీపూంగె భైరవ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

