ప్రజల అవసరాలను గుర్తించే సంక్షేమ పథకాలు అమలు
కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రభుత్వం ఏదైనా ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ అన్నారు. ఇందులో భాగంగానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ టౌన్ 132, మావల 9...