బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని టాక్లీ గ్రామానికి చెందిన అరవింద్ దోహర్కర్ తండ్రి, సిర్సన్న గ్రామానికి చెందిన గోదూరి నర్సన్న కుమారుడు ఇటీవల మరణించడంతో వారి కుటుంబీకులను మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కల్లెం ప్రమోద్ రెడ్డి, దేవన్న ఓల్లఫ్ వార్ దేవన్న, మస్కే తేజరావు,సతీష్ పవార్,తన్వీర్ ఖాన్, విపిన్ ఖోడే, దీపక్ గౌడ్, సురేష్ రెడ్డి, రూపేష్ ఊరడే, రాము, వికాస్, టి.పురుషోత్తం గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

